Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కిరాణా మార్కెట్గా ఎదుగుతోన్న భారత గ్రాసరీస్ విపణిలో సత్తా చాటాలని భావిస్తోన్న ప్రముఖ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ వివిధ ఆఫర్లతో దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ఏడాది గ్రాసరీస్ (కిరాణా, ఆహారోత్పత్తులుఇతరత్రా) వ్యాపారంలోకి అడుగుపెట్టిన అమెజాన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు 'సూపర్ వాల్యూ డే' ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా నెలవారీ సరుకుల కొనుగోళ్లపై క్యాష్బ్యాక్లు, డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ ఆఫర్ 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎస్బీఐ లేదా ఐసీఐసీ కార్డులు, అమెజాన్ పే, అమెజాన్ డిజిటల్ వాలెట్ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్లను అందిస్తుంది.