Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలో మోడీ సర్కారు సమాజంలోని అన్ని వర్గాల వారికి తాయిలాలను ప్రకటించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే శనివారం ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్గా పెన్షన్ను పొందేందుకు గాను వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 1995 జూన్ 28 నాటికి ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో పని చేస్తున్న వారికి ఈ నిర్ణయంతో లాభం కలుగనుంది. బీమా సంస్థలకు చెందిన కొందు ఉద్యోగులు అప్పట్లో అవగాహన లేమితో పాటు వివిధ ఇతర కారణాల వల్ల సాధారణ పెన్షన్కు బదులుగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఎంచుకు న్నారు. దీంతో వారు ఇప్పుడు ఇతర ఉద్యోగుల మాదిరిగా పెన్షన్ను పొందలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం బీమా సంస్థల ఉద్యోగులకు సాధారణ పెన్షన్కు మారే సౌకర్యాన్ని కల్పించనున్నట్టుగా తెలిపింది.తాము తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా దాదాపు 42720 మంది ఉద్యోగులకు, 10720 మంది సీనియర్ సిటిజన్లకు మేలు జరుగుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాజా నిర్ణయంతో భారతీయ జీవిత బీమా సంస్థలోని (ఎల్ఐసీ) 24,595 మంది ఉద్యోగులకు, 18125 మంది ఇతర అయిదు ప్రభుత్వ రంగ బీమా సంస్థల ఉద్యోగులకు మేలు చేయనుంది. ప్రభుత్వ రంగంలోని ఇతర బీమా సంస్థల జాబితాలో జీఐసీ, న్యూ ఇండియా అషూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్షూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్షూరెన్స్ కం పెనీ, యునైటెడ్ ఇండియా ఇన్షూరెన్స్ కంపెనీలు పని చేస్తున్నాయి.