Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయి ర్వేస్కు కష్టాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఈ సంస్థకు చెందిన రద్దయిన విమానాలు కలిగిన ప్రయాణికులను తీసుకెళ్లేం దుకు గాను ప్రభుత్వ రంగ విమాన యాన సంస్థ ఎయిరిండియా నిరాకరించింది. ఎయిరిండియా మాదిరి గానే ప్రయివేటు విమానయాన సంస్థ విస్తారా కూడా ఇదే తరహా నిర్ణయాన్ని ప్రకటించింది. సాధారణంగా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ విమానం ఏదైనా కారణాల వల్ల రద్దయితే ఆ ప్రయాణికులను వేరే సంస్థల విమానాల్లో గమ్యస్థానాలకు చేరుస్తారు. అందుకు గానూ ప్రయా ణికులను తీసుకెళ్లిన విమానయాన సంస్థకు రద్దైన విమానయాన సంస్థ చెల్లింపులు జరుపుతుంది.Q