Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో విమానయానం అందించే గోఎయిర్ విమాన యాన సంస్థ మరోమారు ఆకర్షణీయమైన విమా యాన పథాకాన్ని ప్రకటిం చింది. జాతీయ, అంతర్జాతీ య మార్గాల్లో విమాన టికెట్లను తగ్గింపు ధరల్లో ఆఫర్ చేస్తున్నట్టుగా సంస్థ ప్రకటించించింది. దేశీయ మార్గాల్లో రూ.1099 (అన్నిచార్జీలు కలుపుకొని), అంతర్జాతీయ మర్గాల్లో రూ.4999 (అన్నిచార్జీలు కలుపుకొని) లిమిటెడ్ ఆఫర్తో టిక్కెట్లను ఆఫర్ చేస్తున్నట్టుగా సంస్థ తెలిపింది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్గా తీసుకొచ్చిన పథకం మార్చి4వ తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద టెక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆయా మార్గాల్లో సెప్టెంబరు 1వతేదీ దాకా ప్రయాణాలు చేయవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్ వెబ్సైట్లో పొందుపర్చినట్టుగా సంస్థ తెలిపింది. విమాయన ఇంధన ధరలు పెరిగి విమాన టిక్కెట్ల ధరలను పెంచాలని పోటీ సంస్థలు యోచిస్తున్న వేళ గో ఎయిర్ ఆకర్షణీయ పథకాన్ని ప్రకటించడం విశేషం.