Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు రోజుల్లో రూ.570 తగ్గిన బంగారం ధర
- భవిష్యత్తులో మరింతగా తగ్గే అవకాశం!.
న్యూఢిల్లీ: డిమాండ్ లేక వన్నె తగ్గుతున్న పసిడి ధర శనివారం మరింత వెలవెలబోయింది. బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర. రూ. 350లు క్షీణించింది. దీంతో గత రెండు రోజులుగా పసిడి ధరలు 570 రూపాయిలు తగ్గింది. స్థానికంగా పూర్తి స్వచ్ఛత గత పది గ్రా. బంగారం ధర రూ.33,770కు చేరింది. దీంతో బంగారం ధర మళ్లీ రూ.34 వేల రూపాయల దిగువకు చేరినట్టయింది. స్థానిక బంగారు వర్తకందారుల నుంచి డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయంగా బల హీన సంకేతాలతో పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలు కీలక మద్దతు స్థాయికి దిగజారడంతో రానున్న రోజుల్లో పుత్తడి ధర మరింత దిగి వచ్చే అవ కాశం ఉందని బులియన్ వర్గాల విశ్లేషిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల పుత్తడి రూ.310 నష్టపోయింది. అంతర్జాతీయంగా 1.52 శాతం పతనమై ఔన్స్ బంగారం ధర 1293 వద్ద 1300 డాలర్ల దిగువకు చేరింది. బంగారానికి తోడుగా అనట్టు తాజాగా వెండి ధరలు కూడా పడిపోయాయి. కిలోవెండి ధర కూడా రూ. 40వేల రూపాయల దిగువకు పడిపోయింది. దేశీయ మార్కెట్లో వెండి ధర ఏకంగా రూ.730 క్షీణించి రూ.39,950లకు పడిపోయింది. మరో విలువైన మెటల్ వెండి కూడా 2.47 శాతం పతనమైంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా పది గ్రాముల పసిడి ధర రూ.324 పతనమై రూ. 32,657 వద్ద నిలిచింది. వెండి 758 రూపాయలు క్షీణించి రూ.38,376 వద్ద కొనసాగుతోంది. దీంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింతగా దిగి రానున్నాయన్న విశ్లేషణలకు బలం చేకూరుతోంది.