Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన అనుబంధ బ్రాండ్ 'రియల్ మి'లో నూతన స్మార్ట్ఫన్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. 'రియల్ మి3' పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ఫోన్లో సంస్థ పలు ఫీచర్లను జోడించింది. రియల్ మి 2తో పోలిస్తే డ్యూ డ్రాప్డిస్ప్లే, ఆండ్రాయిడ్ పై కలర్ ఓఎస్తో ఈ స్మార్ట్ఫోన్ను అప్గ్రేడ్ చేశారు. రియల్ మి3 స్మార్ట్ఫోన్లో కంపెనీ రెండు వెనుక కెమేరాలను జోడించింది. 6.2 అంగుళాల హెచ్డీ తెర, 1520టు720 రిజల్యూషన్, ఆండ్రాయిడ్ పై ఓఎస్, 2.1 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ హీలియో పీ70 ప్రాసెసర్, 3/4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్చ 13 ఎంపీ డ్యుయల్ కెమేరాలు, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ, ఈ ఫోన్లోని ఇతర ప్రత్యేకతలు. రెండు వేరియంట్లలో దీనిని సంస్థ అందుబాటులోకి తెచ్చింది. రియల్మి3 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ రూ.8999గాను.. 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను సంస్థ రూ.10,999గాను కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్కార్ట్లో మార్చి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎక్స్క్లూజివ్గా విక్రయించనున్నట్టుగా కంపెనీ వర్గాలు తెలిపాయి. మొదటి మిలియన్ కొనుగోలుదారులకు మాత్రమే 3జీబీ ర్యామ్ వేరియంట్ రూ.8,999కు లభిస్తుందని రియల్మి తెలిపింది. ఇక ప్రారంభ ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే, రూ.500 అదనంగా రాయితీ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.