Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో విమానయాన సేవలను అందిస్తోన్న స్పైస్ జెట్ సంస్థ హైదరాబాద్- కొలంబో(శ్రీలంక రాజధాని) డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించనుంది. హైదరా బాద్-కొలంబో మార్గంలో 12 కొత్త విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మంగళవారం, బుధవారాలు మినహా అన్ని రోజులు ఈ విమానాలు నడుస్తాయని పేర్కొంది. దేశీయ విమాన సర్వీసుల సంస్థ శ్రీలంక, భారత్ మధ్య డైరెక్ట్ విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి. తాజా నిర్ణయంతో జాతీయ, అంతర్జాతీయ మార్గంలో మరో 11 డైరెక్ట్ విమానాలను తీసుకువచ్చేందుకు మార్గం సగమమైందని సంస్థ పేర్కొంది.