Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతీయ స్మార్ట్టీవీ రంగంలో అగ్రస్థానాన్ని అందుకొనేందుకు దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా షావోమి, శాంసంగ్, ఎల్జీ సంస్థలు స్మార్ట్టీవీలను వినియోగదారులకు సరసమైన ధరల్లో అందుబాటులోకి తెస్తున్నాయి. తాజా ఈ క్రమంలోనే మరో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు షింకో వచ్చి చేరింది. 39 అంగుళాల ఎల్ఈడీ టీవీ ఎస్వో4ఏ పేరుతో కొత్త టీవీని ఆ సంస్థ గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను సంస్థ రూ.13,990గా కంపెనీ నిర్ణయించింది. షింకో ఎల్ఈడీటీవీ ధరను రూ.6490 నుంచి ప్రారంభమై, రూ.60 వేల(65 ఇంచెస్) మధ్య వినియోగదారులకు లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. 39 అంగుళాల తెర, 1366.. 768 పిక్సల్స్రిజల్యూషన్ను, రెండు హెచ్డీఎంఐ పోర్టులు ఈ టీవీలో ఉండనున్నాయి. వీటికి తోడు రెండు యూఎస్బీ పోర్టులను ఈ టీవీలో పొందుపర్చారు. 4కె వీడియో ప్లేబ్యాక్కు ఇందులో సపోర్ట్ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే 20 వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్లను సంస్థ ఇందులో జోడించింది.