Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ క్యాబ్ సర్వీస్ల దిగ్గజం ఓలాలో రెండు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయి, కియా కంపెనీలు దాదాపు 300 మిలియన్ డాలర్ల మేర ఓలా సంస్థలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ విషయాన్ని ఓలా సంస్థ కూడా ధ్రువీకరించింది. కియా, హ్యుందారులు సంయుక్తంగా ఈ పెట్టుబడి పెడుతున్నా యని ఓలా వెల్లడించింది. భారత్లో అవసరాలకు తగినట్లు విద్యుత్తు కార్ల తయారీ, ఓలా వ్యాపార భాగస్వాములైన డ్రైవర్లకు అవసరమైన విధంగా వాహనాలను అందజేయ డం, వాహనాల తరలింపు వంటి అంశాల్లో సంయుక్తంగా పని చేయాలని ఈ సంస్థలు నిర్ణయించాయి. ఓలాలో 4శాతం వాటా కొనుగోలు చేసే ఆలోచనలో హ్యుందారు ఉందని వార్తలు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన వెలువ డింది. 'హ్యుందారు వ్యాపార వ్యూహంలో భారత్ అంత్యంత కీలకం. మా లక్ష్యాలను చేరుకోవడానికి ఓలాతో భాగస్వా మ్యం ఉపకరిస్తుంది. దీని ద్వారా స్మార్ట్ మొబిలిటీ సొల్యూ షన్స్ విభాగంలో అడుగుపెట్టే ప్రక్రియ వేగవంత మవుతుంది.'' అని హ్యుందారు ఎగ్జిక్యూటీవ్ ఉపాధ్యక్షుడు యూసున్ చుంగ్ వెల్లడించారు.