Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెట్ సంస్థకు పైలట్ల తాజా హెచ్చరికలు
- సమస్యపై సర్కారు అత్యవసర సమావేశం
- సంస్థను నిలబెట్టాలని కోరిన డీజీసీఏ!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఇబ్బందులను ఎదుర్కొం టున్న ప్రయివేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో సరికొత్త సమస్య వచ్చిపడింది. జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టేందుకు గాను మంగళ వారం ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించి కార్యారణను తయా రు చేస్తున్న వేళ.. ఆ సంస్థకు తాజాగా పైలట్లు షాక్నిచ్చారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సమ్మెబాట పట్టనున్నట్టుగా ప్రకటించారు. తమకు చెల్లిం చాల్సిన వేతనాలు, ఇతర బకాయిల చెల్లింపులకు సబంధించి స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మాసాం తంలోగా జీతాలు చెల్లించకుంటే విమానాలు పైకి ఎగరవని, తమ సేవలు నిలిపివేస్తామని పైలట్లు జెట్ ఎయిర్వేస్ యాజమాన్యాన్ని హెచ్చ రించారు. కంపెనీ దేశీయ పైలట్లతో కూడిన నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్లో మంగళవారం విస్తృతంగా చర్చించిన అనంతరం వారు ఈ ప్రకటన చేశారు. సంస్థను చక్కదిద్దే ప్రణాళికపై స్పష్టత రాకున్నా, వేతన చెల్లింపు లపై పరిష్కారం లభించకపోయినా ఏప్రిల్ 1 నుంచి తాము విధులకు హాజరుకాబోమని గిల్డ్ స్పష్టం చేసింది. వేతనాలపై యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏవియేటర్స్ గిల్డ్ గతవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్కు లేఖ రాసింది. మరోవైపు జెట్ ఇంజినీర్ల సంక్షేమ సంఘ ప్రతినిధులు ఇదే విషయమై పౌర విమానయాన డైరెక్ట రేట్ జనరల్ (డీజీసీఏ)కు లేఖ రాశారు. 'ఆర్థిక అవసరాలు తీర్చుకునేం దుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రభావం మేం చేసే పనిమీద కూడా పడుతోంది. జెట్ ఎయిర్వేస్లో పనిచేసే ప్రతి ఇంజినీరు పరిస్థితి ఇలాగే ఉంది. ఇంజినీర్ల మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల ఇండి యాలో, ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానాల భద్రత ప్రమాదంలో పడుతోంది. సీనియర్ అధికారులు ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. గత ఏడు నెలలుగా జెట్ ఎయిర్వేస్లో సంక్షోభం తలెత్తింది. దీంతో మాకు మూడు నెలలుగా జీతాల్లేవు' అని ఇంజినీర్ల సంఘం లేఖలో పేర్కొంది.
జెట్ను ఆదుకోండి: డీజీసీఏఏప్రిల్ 1నుంచి సమ్మె బాట
జెట్ ఎయిర్వేస్ వద్ద 119 విమానాలుండగా బకాయిలు చెల్లించ కపోవడం, గ్రౌండింగ్ వంటి సమస్యల కారణంగా ఆ సంస్థ కేవలం 41 విమానాలను మాత్రమే నడుపుతోంది. దీంతో మూడోవంతు విమానా లతోనే సంస్థ తన కార్యకలాపాలను నడపాల్సి వస్తోంది. విమానాల ఆకస్మిక రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చివరి నిమిషంలో విమానాలు రద్దవుతుండటంతో అధిక ధర పెట్టి మరో విమానానికి టికెట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడు తోంది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి గాను పౌర విమానయన శాఖ డైరెక్టోరేట్ జనరల్ మంగళవారం సంస్థప్రతి నిధులు, రుణదాతలతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఎన్నికల వేళ జెట్ సమస్య ముదు రుతుండడంతో అప్రతిష్టను దూరం చేసుకొనే ప్రయత్నంలో భాగంగానే మోడీ సర్కారు ఈ దిశగా చర్యలు ప్రారంభిం చినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమావేశంలో జెట్ సంస్థను ఆదుకోవాల్సిందిగా రుణ దాతలైన బ్యాంకులను వేడుకున్నట్టుగా సమాచారం.