Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సంబం ధించి ప్రభుత్వం వెలువరి స్తున్న గణాం కాల్లో విశ్వసనీ యతను ప్రశ్నిం చిన 108 మంది ఆర్థికవేత్తలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక గణాంకాలలో పూర్తిస్థాయి విశ్వసనీయత లభించడం లేదంటూ దాదాపు 108 మంది ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి జైట్లీ స్పందిస్తూ.. ప్రభుత్వ గణాంకాలను ప్రశ్నిస్తున్న ఆర్థికవేత్తలలో అత్యధి కులు ఆది నుంచి మోడీ సర్కారు చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తూ వస్తున్న వారేనంటూ దుయ్యబట్టాడరు. ఎన్నికల వేళ ఇది తమ సర్కా రును భ్రష్టు పట్టించే వ్యూహంలో భాగంగా చేసిన ప్రకటన అని ఆయన అన్నారు. గణాంకాల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్న 108 మంది ఆర్థికవేత్తలలో దాదాపు 70 మంది ప్రభుత్వ వ్యతిరేకులేనని ఆయన అన్నారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తూ.. వృద్ధి పథం లో దూసుకుపోతున్న వేళ దేశంలో ఉద్యోగాల కల్పన జరగలేదని ఎలా అంటారు? అనిటూ యన ట్విట్టర్ వీడియోలో ఆర్థికవేత్తలను ప్రశ్నించారు. ఎవ్వరు నమ్మినా నమ్మకున్నా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ సంస్థలు తమ గణాంకాలను పరిగ ణనలోకి తీసుకుంటాయని ఆయన అన్నారు. ఏడాదికి 10వేల కిలో మీటర్ల రహదారుల, ప్రతీ గ్రామం విద్యుదీకరణ, ప్రతి ఇంటికి మరు గుదొడ్డితో పాటు పలు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న వేళ దేశం లో ఉద్యోగ కల్పన జరగలేదని ఆర్థికవేత్తలు ఆరోపించడం సబబు కాదని జైట్లీ అన్నారు. దేశంలో నిర్మాణ రంగం 10 శాతం వృద్ధితో దూసుకుపోతోందని దీనికి తోడు ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగం దూసు కుపోతూ మెరుగైన ఎగుమతులను నమోదు చేస్తున్నాయని ఈ క్రమ ంలో పలు కొలువుల కల్పన జరుగుతోందని ఆయన వివరించారు.