Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లండన్లో అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీస్
- బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు..
- వజ్రాల వ్యాపారిని నమ్మలేమని కీలక వ్యాఖ్య
- ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ కస్టడికి
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) రూ.13వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి లండన్లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. నీరవ్ లండన్లోని హౌల్బోర్న్ మెట్రో స్టేషన్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలతో వారు నీరవ్ను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ బ్రిటన్ను కోరిన సంగతి తెలిసిందే. భారత్ వినతిపై స్పందించిన వెస్ట్ మినిస్టర్ కోర్టు రెండు రోజుల క్రితం నీరవ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు నీరవ్ను అదుపులోకి తీసుకున్నారు.
బెయిల్ మంజూరీకి కోర్టు 'నో'..
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పెట్టుకున్న బెయిల్ పిటిషనన్ స్థానిక డిస్ట్రిక్ట్ జడ్జీ మ్యారీ మాలోన్ తిరస్కరించారు. ఆయనను ఈ నెల 29 వరకు కస్టడీకి అప్పగిస్తున్నట్టుగా న్యాయమూర్తి ప్రకటించారు. మోడీకి బెయిల్ ఇస్తే పారిపోకుండాకోర్టు ఆదేశాలకు తలొగ్గి విచారణకు హాజరవుతారనేందుకు తమకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. నీరవ్ మోదీ కేసును సంబంధించిన కేసు దర్యాప్తు చేస్తున్నాయి. నీరవ్ మోడీపై చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ మార్చి 9న లండన్లోని హౌంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్ కోర్టు ఇంతకుముందు అతడికి అరెస్టుకు పూర్తిస్థాయి వారెంటును జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్, అతని మామ మెహుల్ చోక్సీపై ఈడీతోపాటు సీబీఐ కూడా మనీలాండరింగ్, తదితర నేరాల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సబంధించి నీరవ్, అతని కుటుంబానికి చెందిన సుమారు రూ. 2,300 కోట్ల ఖరీదైన ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. అయితే ప్రస్తుతానికి కోర్టు నీరవ్కు బెయిల్ నిరాకరించినప్పటికీ గతంలో లిక్కర్ డాన్ విజరు మాల్యా కేసులో మాదిరిగానే మోడీ కూడా బెయిల్ పేరతో లండన్లో ఉంటూనే విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా మరోవైపు పాటు నీరవ్ భార్య అమీ అమీ మోడీపై పీఎంఎల్ఏ న్యాయస్థానం నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది.