Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్తాంబుల్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్బస్ విమానాలను కొనుగోలు చేయనుంది. తాజాగా 20 నుంచి 25 ఎయిర్బస్ ఏ321 విమానాలను కొనుగోలు చేయనున్నట్టుగా సమాచారం. వీటితో సంస్థ త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో 48 విమానాలను కొనుగోలు చేయనుంది. వీటిల్లో 25 ఏ 321 మోడల్వి కాగా.. మిగిలినవి ఏ320 మోడల్వి ఉన్నట్టుగా సంస్థ తెలిపింది. ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విల్లీ బౌల్టర్ బుధవారం ఇస్తాంబుల్లోని ఇండిగో మెయిడెన్ ఫ్లైట్ కార్యక్రమంలో మాట్లాడుతూ తాము ప్రస్తుతం ఇస్తాంబుల్కు రోజుకో సర్వీసును నడుపుతున్నామని ఈ నెల తర్వాత నుంచి రెండో సర్వీసును కూడా ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. మధ్యశ్రేణి దూరాలకు సర్వీసులను పెంచుతామని ఆయన వివరించారు.