Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 222 పాయింట్ల పతనం
ముంబయి : వరుసగా ఎనిమిది రోజులు లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం అడ్డుకట్ట పడింది. భారత వృద్ధి రేటు అంచనాలకు ఫిచ్ కోత పెట్టడంతో మదుపర్లు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 222 పాయింట్లు లేదా 0.58 శాతం పతనమై 38,164.61కు పడిపోయింది. ఓ దశలో అమ్మకాల ఒత్తిడితో ఏకంగా 38,089.36 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈ బాటలోనే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 64.15 పాయింట్లు లేదా 0.56 శాతం కోల్పోయి 11,456.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో టాటా మోటార్స్ అత్యధికంగా 2.47 శాతం విలువ కోల్పోయింది. ఇదే క్రమంలో రిలయన్స్ ఇండిస్టీస్ 2.44 శాతం, మారుతి సుజుకి 1.84 శాతం, ఎస్బిఐ 1.76 శాతం, బజాజ్ ఫినాన్స్ 1.23 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. మరోవైపు ఓఎన్జీసీ అత్యధికంగా 3.67 శాతం లాభపడింది. బీఎస్ఈలో మిడ్క్యాప్ 0.59 శాతం, స్మాల్ క్యాప్ 0.44 శాతం చొప్పున తగ్గాయి. రంగాల వారిగా రియాల్టీ మినహా అన్నీ నష్టపోయాయి. నిఫ్టీలో బ్యాంకింగ్ సూచీ 0.84 శాతం, ఆటో 1.28 శాతం, ఐటీ 0.31 శాతం, ఎఫ్ఎంసీజీ 0.33 శాతం చొప్పున అధికంగా నస్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా చాలా రోజుల తర్వాత తొలిసారి 4 శాతం నష్టపోయింది.