Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్బేనియాలో స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్
- ఆంధ్రా బ్యాంకుకే ఎగనామం..
న్యూఢిల్లీ : భారత బ్యాంకులకు వేల కోట్లు కన్నం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ తరహాలోనే దేశం దాటిన హితేష్ పటేల్ను అల్బేనియా పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు నితిన్, చేతన్, దీప్తి, హితేశ్ పటేల్ తప్పుడు పత్రాలు చూపించి బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులుగా తీసుకుని.. ఎగ్గొట్టారు. ఈ మోసం మొత్తం విలువ రూ.8,100 కోట్లుగా ఉంది. ఈ కంపెనీకి హితేష్ ప్రధాన ప్రమోటర్గా ఉన్నారు. తప్పుడు పత్రాలతో అప్పులు పొంది.. వాటిని దుర్వినియోగం చేసిన ప్రధాన నిందితులు దేశం విడిచి పారిపోయారు. ఈ కేసులో ముఖ్య పాత్రదారుడైనా హితేష్ను పట్టుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటర్పోల్ను ఆశ్రయించింది. వీరిపై మార్చి 11న రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. దీంతో నిందితుల్లో ఒకరైన హితేశ్ పటేల్ను ఈ నెల20న అలబానియా పోలీసులు అరెస్టు చేశారని శుక్రవారం ఈడీ అధికారులు వెల్లడించారు. ఆంధ్రా బ్యాంకు కన్సోరియంలో రూ.5,000 కోట్ల అప్పులు తీసుకున్నారు. ఈ మొత్తం రూ.8,100 కోట్లకు చేరింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఐదు ఛార్జీషీట్లను నమోదు చేసింది. అదే ఏవిధంగా రూ.4,710 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసింది. ఈ మోసంలో ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఇడి విచారణలో తేలింది.