Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో అత్యాధునిక 5జీ టెలికాం సేవలు ప్రస్తుత ఏడాది చివరి నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలిం చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించిందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ దిశగా వేగంగా పని చేస్తోంది. దేశంలో ప్రయోగాత్మకంగా 5జీ సేవలను ఈ ఏడాది చివరి నుంచి గానీ.. వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ అందుబా టులోకి తేనున్నట్టుగా కమిటీ చైర్మెన్ అభరు కరంధీకర్ అన్నారు. వచ్చే ఏడాది రెండు లేదా మూడో త్రైమాసికంలో ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే దిశగా ముందుకు సాగుతున్నట్టు ఆయన వివరించారు. 5జీ సేవల ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు గాను 90 రోజులకు మించి పవన తరంగాలను కేటాయించేందుకు టెలికాం శాఖ ఇప్పటి వరకు విముఖతను వ్యక్తం చేస్తూ వస్తో ంది. అయితే ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని.. 5జీ సేవల ను ప్రయోగాత్మకంగా పూర్తిగా పరీక్షించేందుకు గాను సంస్థ లకు కనీసం ఏడాది కాలం పాటు పవన తరంగాలను కేటాయించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలకు సడలింపు ఎంతైనా అవ సరమని ఆయన పేర్కొన్నారు. దేశంలో 5జీ సేవలను అం దుబాటులోకి తేవాలని యోచిస్తున్న ప్రభుత్వం ఫిబ్రవరి 25న ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ కరంధీకర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కమి టీలో విద్యావేత్తలు, పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వం నుంచి అధికారులు సభ్యులుగ ఉన్నారు. ప్రయోగాత్మకంగా 5జీ సేవలను తేవడం, 5జీ సేవలను చేపట్టేందుక లైసెన్సింగ్ విధానం, అందుకు అవసరమైన ధరలతో పాటు వివిధ టెక్ని కల్ అంశాలపై సూచనల నిమిత్తం సర్కారు దీనిని ఏర్పాటు చేసింది.