Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొటి విదేశాలకు పారిపోయిన లిక్కర్ డాన్ కింగ్ఫిషర్ విజరు మాల్యాపై ఢిల్లీలోని న్యాయ స్థానం సీరియస్ అయింది. ఫెరా చట్టం కింద జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మాల్యాకు బెంగళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ మెట్రోపొలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు జులై10 వరకు గడువు విధించింది. ఇప్ప టికే దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు బెంగళూ రు పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు. మాల్యాను ఇప్పటికే ప్రకటిత నేరగాడిగా కోర్టు పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే మాల్యాపై గత ఏడాది మేలో ఆస్తుల ఎటాచ్మెం ట్కు ఆదేశించిన కోర్టు దీనిపై సమగ్ర నివేదికను అందించాలని కోరింది. ఈ కేసులో మాల్యాపై నాన్బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉన్న సంగతి విదితమే. కాగా రూ.9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాం డరింగ్కు పాల్పడ్డారని విజరు మాల్యాపై ఆరోప ణలు ఉన్నాయి. రుణ బకాయిలను వసూ లు చేసుకు నేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సా ర్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో 2016 లో విజరు మాల్యా లండన్కు పారిపోయాడు. అయితే ఈ కేసులో మాల్యాను తిరిగి భారత్కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.