Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కార్ల ధరలు పెరగనున్నాయి. వచ్చే నెల ఏప్రిల్ నుంచి వివిధ మోడళ్ల ప్యాసెంజర్ కార్ల ధరలను పెంచుతు న్నట్టు కంపెనీ శనివారం వెల్లడించింది. తాజా పెంపు 25 వేల రూపాయల దాకా ఉంటుందని వెల్లడించి ంది. ఆర్థిక పరిస్థితులు, ఇన్పుట్ వ్యయాలు పెరిగిన కారణంగానే ధరల ను పెంచుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా టయోటా, జాగ్వర్ ల్యాండ్ రోవర్ ధరలు పెరుగుతాయని సంస్థ పేర్కొంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాలు, వివిధ బాహ్య ఆర్థిక కారకాల కారణంగా ధరలను పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ధరల పెంపును ప్రకటించడంతో రానున్న రోజుల్లో మిగతా కంపెనీలు కూడా ధరల పెంపుకు తెర తీయవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.