Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ మాజీ ప్రమోటర్, గత నెలలో సంస్థ చైర్మన్గా తప్పుకున్న నరేష్ గోయల్ ఎయిర్లైన్స్లో కీలక వాటాను తిరిగి దక్కిం చు కోవాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. జెట్లో వాటాల కొనుగోలుకు ప్రధాన ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి కనబర్చని నేపథ్యంలో ఆయన నిర్దిష్టమైన రోడ్ మ్యాప్తో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన జెట్కు బిడ్ను దాఖలు చేయనున్నారని సమాచారం. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కూటమి రుణ పరిష్కార ప్రణాళికను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వెస్లో దాదాపు 75 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వా నించారు. అయితే దీనికి పెద్దగా స్పందన లభించక పోవడంతో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డెడ్లైన్ను పొడిగించింది. బిడ్లనును సమర్పించే గడువును ఏప్రిల్ 12వరకు పొడిగిస్తు న్నట్టు ఎస్బీఐ క్యాపిటల్ ప్రకటించింది. దీంతో జెట్ ఎయిర్వేస్లో ఇప్పటికే పెట్టుబడిదారుగా ఉన్న ఎతిహాడ్, జెట్ ఎయిర్ వేస్ మాజీ సీఈవో క్రామర్ బాల్ కూడా జెట్ వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. దాదాపు ప్రతి రోజు ఎస్బీఐ అధికారులతో వీరు సమావేశమవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గోయల్ ప్రయత్నాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
అంతర్జాతీయ సర్వీసులు రద్దు..
నిర్వహణ నిధుల లేమితో విలవిలలాడుతున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ రెండు రోజులపాటు అంతర్జా తీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టుగా ప్రక టించింది. గురువారం, శుక్రవారం విమాన సర్వీసు లను రద్దు చేస్తున్నట్టుగా సంస్థ తెలిపింది. దీంతో ఆమ్స్టర్డాం, ప్యారిస్, లండన్కు జెట్ సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు దీనికి తోడు లీజు చెల్లిం చలేక మరో 10 విమానాలను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ గురువారం బీఎస్ఈ ఫైలింగ్లో ప్రకటిం చింది. దీంతో బకాయిలు చెల్లించలేక నిలిచిపోయిన విమానాల సంఖ్య మొత్తం 79 కి చేరింది. నిబంధ నల ప్రకారం, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపాలంటే ఎయిర్లైన్స్ కనీసం 20 విమానాలను కలిగి వుండాలి. అయితే గత నెలనుంచి కేవలం14 విమానాలను మాత్రమే నడుపుతోంది. ఇది అంతర్జా తీయ కార్యకలాపాలను నిలిపి వేయడానికి దారి తీసి నట్టుగా సమాచారం. ఒకవైపు జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించే ప్రయత్నాలు కొనసాగుతుండగానే, తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్వేస్ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్టు దారుణంగా తయారవుతోంది.