Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ షేర్లు గురువారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఎన్ఎస్ఈలో తొలుత ఇవి 4.21 శాతం ఎగసి 19.80కు చేరాయి. బీఎస్ఈలో అయితే ఏకంగా 3.94 శాతం పెరిగి రూ.19.75కు చేరాయి. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ వికాస్ నిగమ్ షేర్లను రూ.17-19మధ్య ధరతో మార్చి29-ఏప్రిల్3 వరకు పబ్లిక్ ఇష్యూ మార్గంలో బిడ్లను స్వీకరించారు. ఈ ఇష్యూకు 1.8 రెట్లు సబ్స్క్రైబ్షన్ లభించింది.ఈ ఐపీవో ద్వారా రైల్వికాస్ నిగమ్ లిమిటెడ్ రూ.482 కోట్లను సమీకరించింది. ఈ ఐపీవోలో ప్రభుత్వం 12.12శాతం వాటాను విక్రయించింది. 2018 నాటికి రైల్ వికాస్ నిగమ్కు రూ.77,504 కోట్లు విలువైన ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. ఈ సంస్థ కొత్త ట్రాక్లు వేయడం, రైల్వే విద్యుదీకరణ, మెట్రోపాలిటిన్ రవాణ వ్యవస్థలు, వర్క్షాపుల, వంతెనల నిర్మాణం చేపడుతుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో ఈ స్టాక్ 0.26 శాతం లభంతో రూ.19.05 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట క్యాపిటలైజేషన్ రూ.3,971.96 కోట్లుగా నమోదు అయింది.