Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: విలాస వంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షె భారత మార్కెట్లోకి అత్యాధునిక కారును అందుబాటులోకి తెచ్చింది. 'పోర్షె 911' పేరుతో ఆ సంస్థ సరికొత్త మోడల్ కారును గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఎక్స్షోరూం ప్రారంభ ధర రూ.1.82కోట్ల నుంచి రూ.1.99 కోట్ల వరకు పలుకుతుందని కంపెనీ తెలిపింది. పోర్షె 911లో కంపెనీ ఉత్పత్తుల్లో ఇది ఎనిమిదోతరం కారు. కారేరా ఎస్ వేరియంట్ ధర రూ.1.82 కోట్లు కాగా, కారేరా ఎస్ కాబ్రియోలెట్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించారు. కొత్త కారు ఇంజిన్, ఫ్రేముల్లో మాత్రం మార్పులు చేర్పులు చేశారు. సరికొత్త పోర్షె 911లో దీనిలో ఫ్యూయల్ ఇంజెక్షన్ వ్యవస్థ ఉన్న 3.0లీటర్స్ సిక్స్ సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్తో రూపొందించారు. కొనుగోలుదారు అభిరుచిని బట్టి 7స్పీడ్ మాన్యూవల్, లేదా ,8స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ వ్యవస్థతో దీనిని అందించనున్నారు. ఈ కారు ఇంజిన్ 444 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. గత మోడల్ కంటే ఇది 30 బీహెచ్పీ శక్తి ఎక్కువ. ఈ రెండు వేరియంట్ల గరిష్ట వేగం గంటకు 307కిమీ, గంటకు 305 కిమీ వరకు ఉండనుంది.