Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షేరు ఒక్కింటికి రూ.10.50 డివిడెండ్
బెంగళూరు: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అంచనాలకు మించి రాణించింది. ఏకీకృత నికర లాభంలో 10.5శాతం వృద్ది నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ. 4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఇన్ఫీ ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ నికరలాభం రూ. 3,690 కోట్లుగా నమోదైంది. ఇక కంపెనీ ఆదాయం కూడా 19.1శాతం పెరిగి రూ. 21,539 కోట్లకు చేరినట్లు బీఎన్ఈ ఫైలింగ్ సందర్భంగా ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇక 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరం గణాంకాలను చూసినట్లయితే.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ నికర లాభం 3.9శాతం తగ్గి రూ. 15,410 కోట్లుగా ఉంది. అయితే అదే సమయంలో ఆదాయం 17.2శాతం పెరిగి రూ. 82,675 కోట్లకు చేరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.5 నుంచి 9.5శాతం వృద్ధి సాధిస్తామని కంపెనీ ఈ సందర్భంగా అంచనా వేసింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇన్ఫీ షేర్లు ఫ్లాట్గా ముగిశాయి. ఎన్ఎస్ఈలో కంపెనీ షేరు ధర స్వల్పంగా 0.71శాతం లాభపడి రూ. 748 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 0.63శాతం లాభంతో రూ. 747.85 వద్ద స్థిరపడింది. షేరు ఒక్కింటికి రూ.10.50 చొప్పున డివిడెండ్ను ఇవ్వనున్నట్టుగా సంస్థ తెలిపింది.కొత్త సీఎఫ్వోగా నీలంజన్ రారు నియామకానికి ఇన్ఫీ బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 1, 2019నుంచి ఆయన నియామకం అమల్లో వచ్చినట్టుగా పరిగణిస్తామని బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్లో సంస్థ వెల్లడించింది. ట్రాన్స్ఫర్మేషన్ ప్రయాణంలో మొదటి సంవత్సరం పూర్తి చేశామని ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ దిశగా తాము మరింత దూకుడుగా వ్యవహరిస్తూ మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకోనున్నట్టుగా ఆయన తెలిపారు.