Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తగిన ఆర్థిక తోడ్పాటు లభించడం లేదు. ఎంఎస్ఎంఈలకు రుణ సౌలభ్యం సకాలంలో అందాలని, రుణ పరిమాణం భారీగా పెరగాలని ప్రభుత్వ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిరంతరం చెబుతూ.. అదేశాలిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. 2018 డిసెంబర్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (మార్కెట్) వాటా 39% అయితే, 2013 ఇదే నెల్లో ఈ రేటు 58% గా ఉంది. ప్రభుత్వ రంగ భారత చిన్న పరిశ్రమల అభివ ద్ధి బ్యాంక్ (సిడ్బీ), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్సూనియన్ సిబిల్ల తాజా నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.
ఈ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
- ముద్ర, 59 సెకండ్ లోన్ స్కీమ్స్ వంటి పలు పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, చిన్న పరిశ్రమలకు రుణాల్లో తమ మార్కెట్ వాటాను ప్రభుత్వ బ్యాంకులు కోల్పోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఎన్పీఏల సమస్య.
- ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి చిన్న పరిశ్రమలకు మార్కెట్ షేర్ తగ్గినా, ప్రైవేటు రంగ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి మాత్రం ఆదరణ పెరిగింది. ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే... 2013 డిసెంబర్లో చిన్న పరిశ్రమలకు ఇచ్చిన రుణాల్లో వీటి వాటా 22 శాతం అయితే, 2018 డిసెంబర్లో ఈ రేటు 33 శాతానికి చేరింది. నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల విషయంలో ఈ రేటు 13 శాతం నుంచి 21 శాతానికి పెరగడం విశేషం.
- చిన్నపరిశ్రమల ఎన్పీఏలు క్యూ4 కొంత తగ్గాయి.
- ఇక చిన్న పరిశ్రమలకు మొత్తం రుణాలను చూస్తే, 2018 డిసెంబర్తో ముగిసిన ఐదేండ్ల కాలంలో వృద్ధ్ధిరేటు 19.3 శాతంగా ఉంది.