Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.18ల తుది డివిడెండ్ ప్రకటన
ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీసేవల సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి మెప్పించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో సంస్థ నికర లాభం దాదాపు 18 శాతం మేర పెరిగింది. శుక్రవారం సంస్థ ప్రకటించిన లాభాల మేరకు మార్చి త్రైమాసికంలో టీసీఎస్ లాభం రూ.8126 కోట్లుగా నిలిచింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6904 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. తద్వారా సంస్థ మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. ఇదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం 38,010 కోట్లుగా ఉంది. అయితే ఆపరేటింగ్ మార్జిన్లు, ఎబిటా మార్జిన్లు(25.1 శాతం) స్వల్పంగా తగ్గాయి. గత 15ఏళ్లలో ఇదే బలమైన క్వార్టర్ అని టీసీఎఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. ఆదాయం 38,010 కోట్లుగా నమోదైందని సంస్థ తెలిపింది. మెరుగైన ఫలితాల నేపథ్యంలో ప్రతి ఈక్విటీ షేరుకు 18 రూపాయల చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు టీసీఎస్ బోర్డు ఆమోదం తెలిపింది.