Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపాక్ట్ మోడల్ కారు 'సెలేరియో'కు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఈ కారు అమ్మకాలు లక్ష విక్రయాల మార్క్ను దాటాయని మారుతీ సుజుకీ ఇండియా శుక్రవారం తెలిపింది. 2018-19లో మొత్తం 1,03,734 సెలేరియో వాహనాలను విక్రయించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. మొట్టమొదటిసారి ఈ మోడల్ కారును మారుతీ సుజుకీ 2014లో భారత విపణిలో ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు కంపెనీ మొత్తం 4.7 లక్షల యూనిట్ల కార్లను విక్రయించినట్లు ఎంఎస్ఐ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కంపాక్ట్ మోడల్ అమ్మకాలు 10 శాతం మేర పెరిగాయి. ఈ కంపాక్ట్ మోడల్ ఆటో గేర్ షిఫ్ట్ సాంకేతికతో దేశీయంగా మార్కెట్లోకి విడుదలైన మొదటిదని.. ఈ మధ్యకాలంలో ఈ కారును భద్రత విషయంలోనూ అనేక మార్పులతో అప్గ్రేడ్ చేసినట్లు ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్. ఖాల్సీ పేర్కొన్నారు.