Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న ఎస్ఎఫ్ఐఓ
- 15 రోజుల్లో రెండో అరెస్ట్ చేసిన విచారణ సంస్థ
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర విత్త సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ( ఐఎల్ఎఫ్ఎస్) సంక్షోభం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎల్ ఎఫ్ఎస్ మాజీ ఎండీ, సీఈవో రమేష్ భవాను తీవ్రమైన నేరాల దర్యాప్తు కార్యాలయం (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్- ఎస్ఎఫ్ఐఓ) అరెస్టు చేసింది. గ్రూప్ ఎంటిటీలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా అధికారులు ఈ చర్యకు దిగినట్టుగా విచారణ అధికారులు చెబుతున్నారు. భారీగా పన్ను ఎగవేత కేసులో ఆరోపణులు ఎదుర్కొంటున్న రమేష్ భవా తనను అరెస్టు చేయకుండా, క్రిమినల్ ప్రొసిడింగ్స్ ఆపివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించిన కొద్ది రోజులకే ఈ అరెస్ట్ జరగడం విశేషం. దీంతో శుక్రవారం అర్ధరాత్రి దిల్లీలో భవను అరెస్టు చేశారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తు సంస్థ అయిన ఎస్ఎఫ్ఐఓ కంపెనీల చట్టం 447 సెక్షన్ ప్రకారం రమేష్ భవాను అదుపులో తీసుకుందని ఆధికారులు తెలిపారు. ఈ కేసులో ఏప్రిల్ 1న సంస్థ మాజీ చైర్మన్ హరి శంకర్ను ఎస్ఎఫ్ఐఓ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతన్ని ముంబయిలోని బైకుల్లా జైల్లో ఉంచారు. ఇప్పటికే ఎస్ఎఫ్ఏవో కాకుండా ఈడీ ఐఫిన్లోని అవకతవకలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ రైల్ లిమిటెడ్, ఐఎల్ఎఫ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ లిమిటెడ్, ఐఎల్అండ్ ఎఫ్ఎస్ మాజీ ఛైర్మన్ రవి పార్థసారధి, ఎండీలు హరిశంకరన్, భవలపై మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి.