Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది రాజకీయ పార్టీలకు భూరి విరాళాన్ని అందించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ దాదాపు రూ.220 కోట్ల నిధులను ఎలక్టోరల్ ట్రస్ట్కు అందించింది. టీసీఎస్ ఇంత భారీ స్థాయిలో ఎన్నికలకు విరాళాలు ఇవ్వడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తూ టీసీఎస్ ఈ విషయాన్ని తెలిపింది. ఆదాయ వ్యయాల్లో ఇతర ఖర్చుల కింద రూ. 220కోట్లను ఎలక్టోరల్ ట్రస్ట్కు ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ మొత్తం ఏయే రాజకీయ పార్టీలకు అందిందనే విషయంపై మాత్రం కంపెనీ స్పష్టతన్విలేదు. టీసీఎస్ సహా టాటా గ్రూప్కు చెందిన కంపెనీలు గతంలోనూ ఎలక్ట్రోరల్ ట్రస్ట్లకు విరాళాలు ఇచ్చాయి. 2013లో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఏర్పాటైంది. ఈ ట్రస్ట్కు టీసీఎస్ నిధులు ఇచ్చింది. 2013, ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చి 31 వరకు ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి కాంగ్రెస్ సహా పలు పార్టీలు నిధులు పొందాయి.