Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్
- జెట్ను మళ్లీ ఎగరనివ్వాలంటూ వేడ్కోలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకు పోయి, నిర్వహణ నిధులు లేక కొట్టు మిట్టాడతుఉన్న జెట్ ఎయిర్వేస్ సంస్థను కాపాడాలంటూ ఆ సంస్థ ఉద్యోగులు శని వారం నిరసనకు దిగారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం మూడో టర్మినల్ వద్ద దాదాపు 700 మంది ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు రావాల్సిన వేతన బకాయిలను సంస్థ చెల్లించేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 'ఎయిర్ వేస్ను కాపాడండి, మా భవిష్యత్తును కాపాడండి', 'మా బాధ వినండి, 9డబ్ల్యును ఎగరనివ్వండి' అంటూ ప్లకార్డులు పట్టుకొని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 9డబ్ల్యు అనేది జెట్ ఎయిర్వేస్ విమానాల కోడ్. శుక్రవారం కూడా జెట్ ఉద్యోగులు ముంబయిలో నిశబ్దంగా మార్చ్ నిర్వ హించారు. ఈ నిరసనల నేపథ్యంలో నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న జెట్ విమానయాన సంస్థ తాత్కాలిక సాయం కావాలంటూ రుణదాతలకు మొరపెట్టుకుంది. ఆ నిధులతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించే అవకాశం ఉన్నట్లుగా వివరించింది. మరోవైపు శనివారం జెట్ ఎయిర్వేస్ సంస్థ కేవలం ఆరు నుంచి ఏడు విమానాలను మాత్రమే అందుబాటులో ఉంచింది. శని, ఆది వారాల్లో ఆ సంస్థ కేవలం ఆరు నుంచి ఏడు విమానాలను మాత్రమే తిప్పు తుందని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ వెల్లడించారు. ఆ సంస్థ మెరుగ్గా పని చేస్తున్న రోజుల్లో అత్యధికంగా 119 విమానాలను దేశీయ, విదేశీ మార్గాల్లో తిప్పింది. ఇదిలా ఉండగా సోమవారం ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు సమావేశమై తాత్కాలిక సాయం చేస్తే గనుక వాటిని వినియోగించే తీరుపై ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.