Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత్లోని అతిపెద్ద ఐటీసర్వీసుల సంస్థ టీసీఎస్ కొత్త సంస్థల కొనుగోళ్ల విషయంలో ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. కొత్త మేధో సంపత్తి ద్వారా మార్కెట్ను విస్తరించాలని అనుకుంటున్నది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్.గణపతి సుబ్రమణ్యమ్ చెప్పారు. ఇటీవల డబ్ల్యూ12, బ్రిడ్జిపాయింట్ గ్రూప్లను కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన పీటీఐకు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ''మేం కొనుగోళ్లకు అన్నివేళలా సిద్ధంగా ఉంటాం. మాకు కొనుగోళ్లు.. ఆ కంపెనీలను విలీనం చేసుకోవడంలో మంచి రికార్డు ఉన్నది. మా సంస్థకు సరైన మేధో సంపత్తి తీసుకురాగల సంస్థ కోసం మేం మార్కెట్లో అన్వేషణ కొనసాగిస్తాం. స్టార్టప్లు చాలా బాగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్చెయిన్ విభాగాంలో చాలా కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. ఫైనాన్షియల్ విభాగాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి.'' అని వివరించారు. స్టార్టప్ల్లో కొనుగోళ్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా ఇప్పటికే దిగ్గజ కంపెనీలు మొత్తం విలీనాలబాటపట్టాయి. టీసీఎస్ శాప్ సేవలను అందించే ఆల్టీ ఎస్ఏను 75 మిలియన్ డాలర్లకు 2013లో కొనుగోలు చేసింది. ఇన్ఫోసిస్ గత ఏడాది వాంగ్డూడీని 75 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇక విప్రో డిసిగేట్ అండ్ కూపర్లో పెట్టుబడి పెట్టింది.