Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: గత వారం చివర్లో మార్కెట్లో నమోదైన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సోమవారం స్టాక్ మార్కెట్లలో సందడి చేశాయి. ఈ షేర్లు సోమ వారం నాటి ట్రేడింగ్లో దాదాపు 20% మేర లాభపడి రూ.23.70 వద్ద అప్పర్ సర్య్కూట్ను చేరాయి. సోమవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి దాదాపు 9.25 కోట్ల షేర్లు చేతులు మారాయి. రూ.19ల ఐపీవో ధరతో మార్కెట్లో లిస్టయిన ఈ స్టాక్ తొలిరోజు ట్రేడింగ్ ముగిసే సమయానిక రూ.19.05 వద్ద ముగి సింది. ఆ తరువాత పెద్దగా రాణించని ఈ స్టాక్ సోమవారం ఒక్కసారిగా అప్పర్ సర్య్కూట్ను చేరింది. దీంతో సోమవారం ఈస్టాక్ హాట్కేక్లా మా రింది. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో 38,905 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 11,690 వద్ద ముగిశాయి.