Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం అనూహ్యంగా లాభపడి రికార్డు స్థాయిలను చేరాయి. ఈ ఏడాది దేశంలో వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉండనున్నట్టుగా వాతావారణ శాఖ వెల్లడించడం, దేశీయంగా ఎగుమతులు కొంత పుంజుకున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించడంతో పాటు సాంకేతికంగా నిఫ్టీ గోల్డెన్ క్రాస్ లెవల్ను దాటేసినందున రానున్న రోజుల్లో మార్కెట్లు మరింతగా రాణించనున్నాయన్న విశ్లేషణలు, విదేశీ మదుపరుల నుంచి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తుండడం తదితర అనుకూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు మంగళవారం ఒక్కసారిగా భారీ లాభాల దిశగా దూసుకుపోయాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్ సరికొత్త రికార్డులను అధిగమించాయి. దీంతో సెన్సెక్స్ 369 పాయింట్ల లాభంతో 39,275 వద్ద, నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 11,795 పాయింట్ల వద్ద ముగిశాయి. నేటి మార్కెట్లో ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండిస్టీస్, ఎల్అండ్టీ, టీసీఎస్, ఐటీసీ సూచీలను పరుగులు పెట్టించాయి. నిఫ్టీ తొలిసారి 11,798 మార్కును తాకింది. ప్రైవేటు బ్యాంక్ల సూచీ భారీలాభాల్లో ట్రేడైంది. ఇక కొత్తగా లిస్టైన మెట్రో పోలీస్ షేర్లు 4.76శాతం లాభాల్లో ట్రేడైంది. వరల్డ్ ఫండ్ దీనిలో భారీగా వాటాలు కొనుగోలు చేసింది.