Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణి జ్య విభాగం: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 125వ వ్యవస్థాపక దినో త్సవ వేడుకలు హైదరాబాద్ లోని బ్యాంక్ తెలంగాణ సర్కిల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ సర్కిల్ హెడ్ రాధికా బట్వాడేకార్ మాట్లాడుతూ జాతీయోధ్యమ నేపథ్యంలో పీఎన్బీ ఏర్పాటు జరిగిందని వివరించారు. భారతీయుల కోరకు భారతీయులే ఏర్పాటు చేసుకున్న బ్యాంక్ పీఎన్బీ అని ఆమె అభివర్ణించారు. స్వతంత్ర భారతంతో పాటుగా ఆర్థికంగా బలమైన భారత్ను నిర్మించే ప్రధాన ఉద్దేశంతో ఈ బ్యాంక్ ఏర్పాటు జరిగింద ఆమె తెలిపారు. లాహౌరు కేంద్రంగా 1894లో ప్రారంభమైన బ్యాంక్ ప్రస్తుతం 7500 శాఖలతో 10 కోట్ల మంది ఖాతాదారులతో దాదాపు రూ.10 లక్షల కోట్ల వ్యాపారంతో విస్తరించి అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆమె తెలిపారు. బ్యాంక్ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని ఆమె కొనియాడారు. పీఎన్బీ 125వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంక్ అధికారులు వినియోగదారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆనిశా అదనపు డైరెక్టర్, ఐపీఎస్ అధికారి పూర్ణచందర్ రావుతో పాటు రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్.కె. సుల్తానియాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్యాంక్నకు చెందిన పలువురు ఖాతాదారులను అధికారులు సన్మానించారు. కార్పొరేట్ సమాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అణగారిన వర్గాలకు చెందిన మహిళలు, వయో వృద్ధుల సంక్షేమం కోసం పని చేస్తున్న పలు సంస్థల ప్రతినిధులకు ఆర్థిక సాయం అందేలా పీఎన్బీ అధికారులు చెక్కుల పంపిణీని నిర్వహించారు.