Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6-8 నెలల్లో మరో 1000 మె.వా. విద్యుత్తు
- రాష్ట్రంలో విస్తృతంగా 'కుసుమ్' అమలు :
- టీఎస్రెడ్కో వైస్ చైర్మెన్, ఎండీ జానయ్య
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సౌర విద్యుత్తును అత్యధికంగా వినియోగంలోకి తెస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని రాష్ట్ర పునరుత్పత్తి ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్రెడ్కో) వైస్ చైర్మెన్, ఎండీ ఎన్. జానయ్య అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రెన్యూఎక్స్ సమావేశంలో మాట్లా డుతూ రానున్న 6-8 నెలల సమయంలో కొత్తగా అందుబాటులోకి రానున్న యూనిట్ల ద్వారా రాష్ట్రంలో మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు అందుబాటులోకి రానుం దని తెలిపారు. దీంతో రాష్ట్రాంలో మొత్తం సౌర విద్యుత్తు ఉత్పత్తి 4,500 మెగా వాట్లకు చేరనుందని ఆయన తెలి పారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ ప్రత్యేకమైన సౌర విద్యుత్తు విధానాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నందున.. దేశంలో కర్ణాటక తరువాత తెలంగాణలోనే అత్యధి కంగా సౌర విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు మరి ంత బాసటనిచ్చే విధంగా రానున్న రోజుల్లో కుసుమ్ ప్రాజెక్టును విసృత్తంగా అమలు చేయనుందని తెలిపారు. కుసుమ్ ద్వారా సౌర విద్యుత్తు మోటర్ల వ్యవస్థ ఏర్పాటు వల్ల రైతులు ఏడాదికి 100 రోజుల పాటు తమ యూనిట్లతోనే స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకొని వాడుకోవచ్చని.. మిగతా 250 రోజులు తమ యూనిట్ల ద్వారా విద్యుత్తును గ్రిడ్స్కు విక్ర యించి సొమ్ము చేసుకొని వీలుంటుందని తెలి పారు. తెలం గాణ రాష్ట్రం ఎంచుకున్న సౌర విద్యుత్తు పంపిణీ విధానం దేశంలోని పలు రాష్ట్రాలను ఆకర్షిస్తోందని ఆయన తెలిపారు.
26, 27 తేదీల్లో రెన్యూఎక్స్ ప్రదర్శన..
యుబీఎమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 26,27 తేదీల్లో పనరుత్పాదక ఇంధన వనరులకు చెందిన వాణి జ్య ప్రదర్శన జరుగనుంది. హైదరాబాద్లోని హైటెక్స్లో ఏర్పాటు చేయ నున్న ఈ ప్రదర్శనలో దాదాపు 100 సంస్థలు తమ ఉత్పత్తు లకు చెందిన స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నాయని యూబీఎమ్ సంస్థ ఎండీ యోగేష్ ముద్రాస్ తెలిపారు. ఈ ప్రదర్శలో దేశ, విదేశాలకు చెంది న సంస్థలు తమ ఉ్పత్పత్తు లను ప్రదర్శనకు ఉంచను న్నాయి. పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధి ంచిన అనేక ఉత్పత్తు లను ప్రజలకు, పరిశ్రమ వర్గాల వారికి పరిచయం చేయడంతో పాటు వివిధ కొత్త ఉత్ప త్తులను గురించి సమీక్షించడం, విధాన పరమైన చర్చలను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయనున్నారు.