Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారత్లో సొంత మొబైల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యుహో మొబైల్స్ ప్రకటించింది. సంస్థ బుధవారం తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి తొలిసారిగా అడుగుపెడుతూ.. 'యుహో వాస్ట్ ప్లస్' మొబైల్ను సంస్థ మార్కెట్లోకి ఆవిష్కరించింది. 6.2 అంగుళాల తెర, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ సెల్పీ కెమేరా, 13 ఎంపీ ప్రథమిక కెమేరా, 32 జీబీ అంతర్గత మెమోరీ, 4జీబీ డీడీఆర్3 ర్యామ్, ఫేస్ లాక్, ఫింగర్ప్రింట్ లాక్ సదుపాయాలతో దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఈ మొబైల్ ధరను కంపెనీ రూ.9,499గా ప్రకటించింది. అందుబాటు ధరలో విలాసవంతమైన స్మార్ట్ఫోన్లు ఆనే నినాదంతో తాము భారత మార్కెట్లో విస్తరిస్తున్నట్టుగా సంస్థ అమ్మకాల విభాగం డైరెక్టర్ కేశవ్ అరోరా తెలిపారు. తమకు భారత వ్యాప్తంగా దాదాపు 10,000 రిటైల్ అవుట్లేస్ ఉన్నాయని, దాదాపు 500 వరకు సర్వీసింగ్ సెంటర్లను కలిగి ఉన్నట్టుగా ఆయ వివరించారు. భారత్లో సొంత మొబైల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు గాను తాము యోచిస్తున్నామని ఆయన అన్నారు. ఇందుకు గాను దాదాపు రూ.100 కోట్ల వ్యయం చేయనున్నట్టుగా వివరించారు. ప్రస్తుతం తాము గురుగావులోని ఎస్కేడీ యూనిట్ ద్వారా మొబైల్స్ను తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు కొత్త ప్లాంటును గురుగావులో గానీ లేదా తిరుపతిలో గానీ ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో తాము చర్చలు జరుపుతున్నట్టుగా వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 500 మందికి ఉపాధి కల్పించనున్నట్టుగా వివరించారు. రెండు మూడు నెలల్లో ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేసే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టగా తెలిపారు. డిసెంబరు ముగింపు నాటికి కొత్తగా 8 కొత్త మోడల్ ఫోన్లను అందుబాటులోకి తేనున్నట్టుగా ఆయన వివరించారు.