Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలలో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు, రిలయన్స్ ఫలితాలపై భారీ సానుకూల అంచనాలతో గురువారం ఉదయం మార్కెట్లు చాలా ఉత్సాహంగానే ప్రారంభమ య్యాయి. అయితే ఆ తర్వాత కీలక రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు కుదేలయ్యాయి. ఫలితంగా ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది. ఇంట్రాడేలో 39,487 వద్ద జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకింది. అటు నిఫ్టీ కూడా 11,850 మార్క్ను దాటి రికార్డు స్థాయిలో ట్రేడ్ అయింది. అయితే సూచీల జోరు ఎంతోసేపు నిలువలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, మౌలిక, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో సూచీలు కుదేలయ్యాయి. ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేకపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు దిగజారి 39,140 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 11,753 వద్ద స్థిరపడ్డాయి. దీంతో మార్కెట్ నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెక్టోరల్ ఇండెక్స్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్లు ఎక్కువగా నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో రిలయన్స్, టాటామోటార్స్, విప్రో, భారత్ పెట్రోలియం షేర్లు లాభపడగా.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, యస్ బ్యాంక్, హిందాల్కో, వేదాంతా లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.