Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిలయన్స్ నుంచి అనూహ్య ఫలితాలు
- మెరుగ్గా రాణించిన రిటైల్, జియోలు
- చమురు శుద్ధిలోనూ కలిసొచ్చిన లాభం
ముంబయి: దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండిస్టీస్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలన ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలానికి సంస్థ రూ.10,362 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇండియన్ ప్రైవేట్ రంగ కంపెనీల్లో ఈ స్థాయి లాభాన్ని ప్రకటించిన కంపెనీ మరొకటి లేదు. మరోవైపు ఈ క్యూ4లో కంపెనీ ఆదాయం 18 శాతం పెరగుదలతో రూ.1.42 లక్షల కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన విశ్లేషించి చూస్తే మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం 10 శాతం మేర పెరిగింది. ఈ ఏడాది వార్షిక ఫలితాలలో అన్ని విభాగాల్లో ఉన్న తమ కంపెనీలు మెరుగ్గా రాణించాయని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. 'రిలయన్స్ రిటైల్ రూ.1,00,000 కోట్ల రెవెన్యూ మైలురాయిని దాటింది. జియో కస్టమర్ల సంఖ్య 30 కోట్ల మార్క్ అధిగమించింది. పెట్రో కెమికల్స్ బిజినెస్లో హైయెస్ట్ ఎర్నింగ్స్ నమోదయ్యాయి' అని రిలయన్స్ ఇండిస్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ తెలిపారు. మరోవైపు టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో స్టాండలోన్ నికర లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా రూ.840 కోట్లుగా నమోదయ్యింది. వార్షిక ప్రాతిపదికన ఇందులో 65 శాతం పెరుగుదల కనిపించినట్టుగా సంస్థ తెలిపింది. ఇక కంపెనీ ఆదాయం రూ.11,106 కోట్లుగా నమోదైందని అంబానీ వివరించారు.