Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత్లో ఆర్థిక పరిస్థితి, సూక్ష్మ గణాంకాలు దిగజారుతుం డడంతో ఆ దేశంలో వ్యాపార సెంటిమెంట్ పడిపోతోందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ డూన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ వెల్లడించింది. గత ఏడాది రెండో త్రైమాసిక కాలంలో భారత్లో వ్యాపార ఆశావాద సూచీ 78.4 పాయింట్లకు జారిందని డూన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలీస్తే ఈ సూచీ దాదాపు 7.7 శాతం మేర కుంగిందని తెలిపింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో ఈ సూచీ 85 పాయింట్ల వద్ద నిలిచిందని సంస్థ తెలిపింది. అయితే గత ఏడాది మొదటి త్రైమాసిక కాలంతో పోలిస్తే భారత్లో రెండో త్రైమాసిక కాలానికి వ్యాపార సెంటిమెంట్లో 6.3 శాతం మేర వృద్ధి నమోదైందని సంస్థ తెలిపింది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాలు వాటి పరిణామాలతో పాటు విదేశాలలో సొమ్ము తీసుకొనేందుకు వీలుగా బ్యాంకులు జారీ చేసే లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎల్వోయు), లెటర్ ఆఫ్ క్రెడిట్లపై (ఎల్వోసీ) ఆర్బీఐ నిషేధం విధించడంతో పాటు వ్యవస్థలో ద్రవ్యలభ్యత సమస్యలు వ్యాపార సెంటిమెంట్ను దెబ్బతీశాయని డూన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ తెలిపింది. దీనికి తోడు బ్యాంకులు రుణాలనిచ్చే నిబంధనలను కఠినతరం చేయడం వ్యాపార సెంటిమెంట్ను బాగా ప్రభావితం చేసినట్టుగా సంస్థ వివరించింది. వ్యాపార సెంటిమెంట్ దెబ్బతింటున్నప్పటికీ బలమైన ఆర్థిక మూలలుండడంతో పాటు ప్రపంచ వాణిజ్యానికి భారత్ కీలకంగా మారిన నేపథ్యంలో ప్రపంచ ఆ దేశం దిశగా ఆశవహంగానే ముందుకు సాగుతోందని నివేదక తెలిపింది. అయితే తరువాత కాలంలో వ్యవస్థలో ద్రవ్యలభ్యత క్రమంగా పెరగుతుండడంతో మళ్లీ విదేశీ పెట్టుబడిదారులు భారత్లో పెట్టుబడులు పెట్టే దిశగా సన్నద్ధమవుతున్నారని సంస్థ నివేదిక తెలిపింది.