Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2013- 2018 వరకు
- 2.04 కోట్ల మంది గుర్తింపు
- ఐటీ చేతుల్లోకి రిటర్ను దాఖలు, ఎగవేతల పూర్తి వివరాలు..
- ఇప్పటికే నోటీసులు జారీ.. జున్ 30 నుంచి చర్యలు
న్యూఢిల్లీ: దేశంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రతక్ష పన్నులు బోర్డు (సీబీడీటీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల కాలంలో అసలు రిటర్నులను దాఖలు చేయని వారి వివరాలను.. గతంలో రిటర్నులు దాఖలు చేస్తూ మధ్యలో నిలిపివేసి.. మళ్లీ మొదలు పెట్టిన వారి వివరాలను సీబీడీటీ సమీకరించింది. సీబీటీడీ వద్ద అందుబాటులో ఉన్న అత్యాధునిక నాన్-ఫైలర్ మోనిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎస్) పరిజ్ఞానం సహాయంతో వీరి వివరాలను సమీకరించారు. వీరిపై జున్ 30 నుంచి తగిన చర్యలు చేపట్టేందుకు గాను సీబీడీటీ ఆదాయపు పన్ను శాఖకు ఇప్పటికే తగు ఆదేశాలనిచ్చింది. ఎన్ఎంఎస్ ప్రకారం 2013 నుంచి 2017 మధ్య కాలంలో దాదాపు 2.04 లక్షల కోట్ల మంది తమ ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖకు వెల్లడించలేదు. ఇందులో దాదాపు 25 లక్షల మంది మధ్యమధ్యలో రిటర్నుల దాఖలు చేయని వారే ఉండడం విశేషం. వీరికి నోటీసులను పంపే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని.. ఆయా కేసుల ఆధారంగా వీరిపై తగిన చర్యలను తీసుకోనున్నట్టుగా ఐటీ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271ఎఫ్ ప్రకారం పన్ను రిటర్నులను దాఖలు చేయని వారి నుంచి అపరాధ రుసుమును వసూలు చేయనున్నారు. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు ఆగస్టు 31 గడువు తేదీ ముగిసిన తరువాత నుంచి డిసెంబరు 31 మధ్య కాలంలో పన్ను చెల్లిస్తే రూ.5000 వరుకు అపరాధ రుసుమును విధించనున్నారు. డిసెంబరు 31 తరువాత రిటర్నులు ఇస్తే రూ.10,000 వరకు ఫైన్ను వసూలు చేసే వీలుంది. ఈ విషయంలో చిన్నమొత్తంలో పన్ను చెల్లింపులు జరిపే వారికి మినహాయింపు ఉంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించని వారి నుంచి ఏడాదికి గరిష్టంగా రూ.1000 వరకు పన్ను చెల్లించే వీలుంది. ఆదాయపు పన్ను శాఖ సమాచారం మేరకు 2013 నుంచి పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి సంఖ్య గణనీయంగా పెరగుతూ వస్తోంది. 2014లో వీరి సంఖ్య 12.2 లక్షలుగా ఉంది. ఇది 2015 నాటికి ఇది 67.5 లక్షలకు పెరిగింది. పన్ను రిటర్నులను మధ్యలో అపేసిన వారి సంఖ్య 2018 ఆర్థిక సంవత్సరంలో 25.2 లక్షలుగా నిలిచింది. అంతకు ముందు ఏడాదిలో ఇది 28.3 లక్షలుగా ఉంది. రిటర్నుల దాఖలులో జాప్యాన్ని గుర్తించి అసెసింగ్ ఆఫీసర్ కేసును గుర్తించిన మూడు నెలల నుంచి రెండేండ్ల కాలంలో చర్యలు ప్రారంభించే వీలుంది. ఆదాయం రూ.25 లక్షలకు మించి ఉంటే ఈ విచారణ ప్రారంభ సమయాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.