Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊపిరాడక మృతి : పోస్టుమార్టం నివేదిక
- మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ దివంగత నేత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ తివారీది సహజ మరణం కాదని పోస్టుమార్టు నివేదికలో వెల్లడైంది. గొంతు నులమడం లేదా ఇతర చర్యల వల్ల ఆయనకు శ్వాస అందక చనిపోయి ఉండొచ్చనే సంకేతాలనిచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్లో మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత పోలీసులు మర్డర్ కేసును నమోదు చేసి దర్యాప్తు కోసం క్రైం బ్రాంచ్కు కేసును బదిలీ చేసినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. గొంతు నులమడం, ఊపిరాడకుండా చేయడం ద్వారా రోహిత్ తివారీ మృతి చెందినట్టు మెడికల్ బోర్డు స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. ఇది హఠాత్తుగా చోటుచేసుకున్న అసహజ మరణమని వివరించారు. రోహిత్ తివారీ మంగళవారం తన నివాసంలో ముక్కులో నుంచి రక్తం కారుతూ స్పృహ కోల్పోయిపడిపోయారని హౌజ్స్టాఫ్.. రోహిత్ తివారీ తల్లికి తెలిపారు. అనంతరం ఆయనను దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రికి అంబులెన్స్ తీసుకెళ్లగా, ఆయన అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు.