Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు శుక్రవారం అమాంత పెరి గాయి. శుక్రవారం నాటి బులియన్ ట్రేడింగ్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.305 పెరిగి, రూ.32,690కి చేరింది. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం బంగా రం ధర పెరుగుదల కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపా యి.మరో పక్క వెండిధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి, రూ.38,450కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ వల్ల వెండిధర పెరిగింది. గురువారం ఒక్కరోజే బంగారం ధరూ.405 తగ్గడంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 32,385కు పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆభరణాల తయారీదారుల నుంచి పసిడి కొనుగోళ్లు పెరిగాయి. గుడ్ఫ్రైడే కారణంగా అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లు పని చేయలేదు.