Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటరుకు 24 కి.మీ. 'హై'బ్రిడ్ మైలేజీ
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన బాలెనో మోడల్లో కొత్త వేరియంట్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్తో నడిచే సరికొత్త ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో వేరియంట్ను విపణిలోకి అధికారికంగా విడుదల చేసినట్లు మారుతీ ప్రకటించింది. భారత్ స్టేజ్-4 కర్బన ఉద్ఘారాల నియంత్రణకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దామని కంపెనీ సోమవారం తెలిపింది. దీని ధరను కంపెనీ రూ.5.58 లక్షల నుంచి రూ. 8.9 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ)గా నిర్ణయించారు. ఈ మోడల్లో స్మార్ట్ హైబ్రిడ్ సాంకేతికతతో నడిచే మరో రెండు కొత్త వేరియంట్లను కూడా సంస్థ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 1.2 లీటర్ డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ పెట్రోల్ సామర్థ్యంగల మోడల్ ధరను కంపెనీ రూ. 7.25 లక్షలుగాను.. జెటా వేరియంట్ ధర రూ.7.86 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. స్మార్ట్ హైబ్రిడ్ సాంకేతికతతో నడిచే ఈ వేరియంట్స్ అన్నీ ఒక లీటర్ పెట్రోల్కు 23.87 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. ఈ వేరియంట్లోని ఇంజిన్ హర్డ్వేర్, సాఫ్ట్వేర్, ఎగ్సాస్ట్ వ్యవస్థలో అనేక మార్పులు చేసినట్లు కల్సి పేర్కొన్నారు. అంతేకాక స్మార్ట్ హైబ్రిడ్ సాంకేతికతతో నడిచే ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో దేశంలో ఇదే మొదటిది అని సంస్థ ప్రకటించింది.