Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ మేటి భద్రతా ప్రమాణాలతో సరికొత్త ఆల్టో-800 కారును మంగళవారం మార్కె ట్లోకి ఆవిష్కరించింది. కొత్త కారును బీఎస్-4 ప్రమాణాలతో కూడిన ఇంజిన్తో ఆధునీకరించారు. దీనికి తోడు కొత్త ఆల్టో-800ను యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఈబీడీ), రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్రైవర్ ఎయిర్బ్యాగ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్తో పాట డ్రైవర్, కొ-డ్రైవర్లకు సంబంధించిన సీట్బెల్ట్ రిమైండర్ వ్యవస్థలను కొత్త ఆల్టో మోడల్లో అమర్చారు. కొత్త కారును మూడు వేరియంట్లలో మారుతీ అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరను కంపెనీ రూ.2.93 లక్షల నుంచి రూ.3.71 లక్షలుగా (ఎక్స్షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించారు. కొత్త ఆల్టో కారు లీటరుకు అత్యధికంగా 22.05 మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. వరుసగా గత 15 సంవత్సరాలుగా మేటిగా అమ్ముడవుతున్న కారుగా చరిత్ర సృష్టిస్తున్న ఆల్టో కారును మరింత ఆధునీకరించి అందుబాటులోకి తేవడాన్ని వినియోగదారులు స్వాగతిస్తారని.. అమ్మకాలను మరింతగా పెంచుకొనేందుకు ఇది ఎంతగానో దోహదం చేయగలదని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన ఆల్టో మోడల్ కారు ఇప్పటి వరకు 37 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.