Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వీడియోలకు అదనపు హంగులు జోడించి స్నేహితులతో పంచుకునే టిక్-టాక్ యాప్పై భారత్లో నిషేధం విధించడం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని యాప్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ కోర్టు ముందు తమ గోడును విన్నవించుకుంది. నిషేధం వల్ల ఆర్థికంగా తమ సంస్థ నష్టపోతోందని, ఈ నష్టం రోజుకు 5 లక్షల డాలర్ల వరకు ఉంటుందని (సుమారు రూ.3.5 కోట్లు) కంపెనీ తెలిపింది. దీనికి తోడు 250 మంది ఉద్యోగాలపై ఉద్వాసన కత్తి వేలాడుతోందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ను వంద కోట్ల మంది వినియోగిస్తుండగా, భారత్లో ఏకంగా 30 కోట్ల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ యాప్ ద్వారా పోర్నోగ్రఫీ విస్తృతంగా వ్యపిస్తుండడంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో భారత్లో టిక్-టాక్ డౌన్లోడ్ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యాపిల్, గూగుల్లు తమ యాప్స్టోర్స్ నుంచి టిక్టాక్ను తొలగించాయి. దీంతో టిక్-టాక్ కంపెనీ బైట్డ్యాన్స్ను నష్టాలు చుట్టు ముట్టాయి. ఈ నేపథ్యంలో బైట్ డ్యాన్స్ కోర్టును ఆశ్రయించింది. టిక్-టాక్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వచ్చే బుధవారం ఈ కేసు విచారణకు రానుంది.