Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి వినూత్న ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన హెక్సాల్ ఫ్యాన్స్ సంస్థ భారత్లోని తమ అనుబంధ సంస్థ హెక్సాల్ ఫ్యాన్ ఇన్నోవేషన్ వరల్డ్వైడ్ సంస్థలతో కలిసి రెక్కలు లేని సీలింగ్ ఫ్యాన్ను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. థర్మల్ డెస్ట్రాటిఫికేషన్ టెక్నాలజీతో వీటిని సంస్థ రూపొందింది. ఈ వినూత్న ఫ్యాన్లో రెక్కలకు బదులుగా 50 వాట్ల డీసీ కరెంటు మోటరు ఉంటుందని.. ఇది గదిలోని వేడి గాలిని స్వీకరించి డిస్కుల ద్వారా 360 డిగ్రీలలో అంటే గది నలుమూలల చల్లని గాలిని వెదజల్లుతుందని సంస్థ హెక్సాల్ ఎండీ ప్రేమ్కుమార్ ఖతారీ తెలిపారు. ఈ కొత్త తరహా ఫ్యాన్ల వల్ల చాలా తక్కువగా విద్యుత్తు వినియోగం జరుగుతుందని వివరించారు. ఫలితంగా కరెంటు బిల్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. హెక్సాల్ ఇన్నోవేషన్స్ డైరెక్టర్ సిదార్థ ఖతారీ మాట్లాడుతూ ఈ ఫ్యాన్లు ఎల్ఈడీ మోడల్లోను, ఎల్ఈడీ లేని మోడల్లో కూడా అందుబాటులో ఉంచినట్టుగా వివరించారు. ఈ ఫ్యాన్లు ఎనిమిది రంగుల్లో లభిస్తాయని వీటి ధరను కంపెనీ రూ.22,600 నుంచి రూ.25,960గా కంపెనీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ధోమెక్ సొల్యూషన్స్ ఎండీ రఘురామ్రెడ్డి వెన్నపూస, డైరెక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో వీటిని విస్తృతంగా అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. కార్పొరేట్ కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని వారు తెలిపారు.