Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల దిగ్గజ సంస్థ షావోమి తాజాగా మూడు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్మీ వై3, రెడ్మీ 7ను స్మార్ట్ఫోన్లను సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి తోడు సంస్థ తొలిసారిగా స్మార్ట్ ఎల్ఈడీ బల్బును మార్కెట్లోకి విడుదల చేసింది. షామీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ జైన్, చీఫ్ మార్కెటింగ్ అధికారి అనూజ్ శర్మ వీటిని బుధవారం అధికారికంగా విడుదల చేశారు. రెడ్మీ వై3 ఫోన్ను ముందువైపు 32 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, వెనుక 12 ఎంపీ డ్యుయల్ కెమెరా, 15.9 సెంటీమీటర్ల డాట్ నాట్చ్ డిస్ప్లే (కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5), క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు.. 3 జీబీ ప్లస్ 32 జీబీ, 4 జీబీ ప్లస్64 జీబీ నిల్వ సామర్థ్యంతో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999. మరోవైపు రెడ్మీ 6కు అప్గ్రేడ్ వెర్షన్గా సంస్థ రెడ్మీ 7ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. 8 ఎంపీ సెల్ఫీ కెమేరా, వెనుక 12 ఇంటూ 2 ఎంపీ డ్యూయల్ కెమేరా, 15.9 సెంటీమీటర్ల డాట్ నాట్చ్ డిస్ప్లే,క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 632 , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ప్లస్ 32 జీబీ, 3 జీబీ ప్లస్ 32 జీబీ నిల్వసామర్థ్యంతో ఈ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ ప్రారంభ ధరను కంపెనీ రూ.7,999గా నిర్ణయించింది. ఈనెల 29 నుంచి ఎంఐ.కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎంఐ స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉంటుందని, రెడ్మీ వై3 మాత్రం ఏప్రిల్ 30 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనికి తోడు సంస్థ భారత్లో మొట్టమొదటి ఐవోటీ ఆధారిత స్మార్ట్ ఎల్ఈడీ బల్బును కూడా ఇదే వేదికపై ఆవిష్కరించింది.