Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేడుకగా వ్యవస్థాపక దినోత్సవ సంబురాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: అలహాబాద్ బ్యాంక్ 155వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు హైదరబాద్ జోనల్ పరిధిలో వేడుకగా జరిగాయి. బుధవారం హైదరబాద్లో ఏర్పాటు చేసిన వ్యవస్థాపక దినోత్స వేడుకలను ఆ బ్యాంక్ ఎఫ్జీఎం రాకేష్ కుమార్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అతి పురాతనమై బ్యాంక్గా ఉన్న అలహాబాద్ బ్యాంక్ దినదినప్రవర్థమానకంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ ప్రస్థానంలో బ్యాంకునకు బాసటగా నిలిచిన ఖాతాదారులను, ఉద్యోగులకు ఆయనకృతజ్ఞతలు తెలిపారు. అనంతర బ్యాంక్ కొత్తగా ప్రవేశపెట్టిన '''ఆల్ బ్యాంక్ పౌండేషన్ డే డిపాజిట్ ఫర్ 155 అండ్ 333 డేస్'' పథకం గురించి వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి ఉపయుక్తంగా ఉండేలా ఈ కొత్త పథకం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించబడ్డట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంక్ జనరల్ మేనేజర్ డెజిగేటడ్ మరియు జోనల్ హెడ్ బి.కె.సారంగి మాట్లాడుతూ నాణ్యమైన సేవలను అందిచేందుకు బ్యాంక్ అంకితభావంతో ముందుకు సాగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్జీఎమ్వో దక్షిణ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.కె. కపూర్, డీజీఎం డెజిగేటెడ్ హెచ్. నర్నింహులు, బ్యాంక్ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వ్యవస్థాపక వేడుకల్లో భాగంగా బ్యాంక్ ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సికింద్రబాద్లోని 'లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్' వృద్ధాశ్రమంలోని వారికి ఉచితంగా మధ్యాహ్న భోజనంతో పాటు పండ్లు కూడా అందజేశారు. అలహాబాద్ బ్యాంక్ రానున్న రోజుల్లో వినియోగదారులకు మరింత మెరగైన సేవలను అందించే విషయంలో టెక్నాలజీని వినూత్న రీతుల్లో వినయోగిస్తూ ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు