Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఫెడ్ఎక్స్ సంస్థ గురువారం 'గ్లోబల్ సిటిజన్షిప్ నివేదిక'ను విడుదల చేసింది. మెరుగైన పనితీరుతో తమ సంస్థ వృద్ధి పథంలో దూసుకుపోతోందని సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో 9 శాతం వృద్ధితో సంస్థ తన ఆదాయాన్ని 65 బిలియన్ డాలర్లకు పెంచుకుందని సంస్థ వివరించింది. దీంతో ఫెడ్ఎక్స్ సంస్థ అమెరికాలోని ఫార్ఛూన్ 500 కంపెనీల జాబితాలో 50వ స్థానానికి ఎగబాకిందని ఆయన అన్నారు. తమ వ్యాపార విస్తృతి ఉన్న అన్ని దేశాలు, తమ భాగాస్వాములు ఆర్థికంగా వృద్ధి చెందేలా సంస్థ పని చేస్తోందని ఫెడ్ఎక్స్ తెలిపింది. కంపెనీ ఆర్థిక వ్యవస్థ, ప్రజలు, పర్యావరణ అనే మూడు ప్రధాన సామాజిక బాధ్యతా వ్యూహాలతో ఫెడ్ఎక్స్ ముందుకు సాగుతోందని సంస్థ తెలిపింది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తమ సంస్థ షేరు హోల్డర్లకు గరిష్టంగా 535 మిలియన్ డాలర్ల మేర డివిడెండ్ను అందించిందని సంస్థ తెలిపింది. ప్రపంచ దేశాల మేలే పరమావధిగా తమ సీఎస్ఆర్ కార్యకలాపాలు ముందుకు సాగుతున్నాయని ఫెడ్ఎక్స్ తన నివేదికలో తెలిపింది.