Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 324 పాయింట్లు పడిన సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు చమురు ధరల సెగ తగిలింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాల్లోకి జారుకున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్ 75 డాలర్లకు చేరడంతో మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు రూపాయి మరింతగా బలహీనపడడం, అలాగే గురు వారం ఏప్రిల్ డెరివేటివ్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు ముగిం పు తేది కావడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాంగ్ ఆఫ్ లోడింగ్ జరపడం, వచ్చే సిరీస్కు రోలోవర్ చేయ డంలో ఆసక్తి చూపకపోవడంతో మార్కెట్ భారీగా నష్టపోయాయి. దీనికి తోడు ఆటో, లోహ, ఎనర్జీ, ఫైనాన్షియల్ షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అంతకు ముందు రోజు మార్కెట్లు భారీ లాభాలతో ముగియ డంతో గురువారం ఉదయం దేశీయ స్టాక్మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 42 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఏప్రిల్ ఫ్యూ చర్స్ అండ్ ఆప్షన్స్ గడువు ముగియనున్న నేపథ్యం లో మార్కెట్లు లాభపడ్డాయని విశ్లేషకులు తెలిపారు. మధ్యాహ్నం సమయానికి నష్టాల బాట పట్టిన సూచీ లు చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీనికి తోడు ముడి చమురు ధర పెరుగుదల మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో మార్కెట్లకు ట్రేడిం గ్లో వచ్చిన లాభాలన్నీ ఆవిరై, నష్టాల ఊబిలోకి జారుకున్నాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయా నికి బీఎస్ఈ సెన్సెక్స్ 324 పాయింట్లు నష్టపోయి, 38,730.86 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 84.35 పాయింట్ల నష్టంతో 11,641 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలు వ రూ.70.21 దరిదాపుల్లో కొనసాగింది. సెక్టోరల్ ఇండెక్స్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. అయితే ఒక్క నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ మాత్రం లాభాల్లోనే ఉండిపో యింది. బ్యాంక్, మెటల్ షేర్లు బాగా పడిపోయాయి. నిఫ్టీ 50లో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, యూపీఎల్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 5 శాతానికి పైగా లాభపడింది. అదే సమయంలో భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్, వేదాంత, మారుతీ సుజుకీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.