Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాము కల్పిస్తున్న వివిధ రకాల పన్ను మినహాయింపు ఫలాను దేశంలోని పలు బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీ) వినియోగదా రులకు అందించడం లేదు. పన్ను మినహాయింపులను తమ ఖాతాలో వేసుకొని లాభాలను మాత్రం పెంచుకుంటున్నట్టుగా వివిధ విశ్లేషణల ద్వారా తెలుస్తోంది. ఇటీ వల ఇదే విషయాన్ని రుజువు చేస్తూ అమెరికాకు వినియోగదారు వస్తు వుల తయారీ దిగ్గజం ప్రొక్టర్ అండ్ గ్యాంబెల్ (పీ అండ్ జీ) దాదాపు 35 మిలియన్ డాలర్ల మేర పన్ను రాయితీలను వినియోగదారులకు అందిం చకుండా తన ఖాతాలో వేసుకుంది. ఇదే విషయమై పలు ఎంఎన్సీ సంస్థల ఖాతా పుస్తకాలను ప్రభుత్వ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గ జం శాంసంగ్, అమెరికా మందుల తయారీ సంస్థ జాన్స్న్ అండ్ జాన్స్ వ్యవహారం తీరుపైన కూడా పన్ను శాఖకు చెందిన అధికారులు విచారణ జరుపుతున్నారు. దేశంలో కొత్తగా అమలులోకి తెచ్చిన వస్తుసేవల పన్నులోని అవకతవకలతో పాటు యాంటీ ప్రాఫిటరింగ్ వ్యవహారాలను పరిశీలించేందుకు గాను ఏర్పాటు చేసిన జాతీయ యాంటీ ప్రాఫిటరింగ్ ప్రాధికారిక సంస్థ వివిధ ఎంఎన్సీ సంస్థల కార్యకాలాపాలను గురించి విశ్లేషణ జరుపుతోంది. ఇదే విషయమై శాంసంగ్ సంస్థ స్పందిస్తూ తాము ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పన్ను మినహాయింపు ఫలాలను ప్రజలకు అందించినట్టుగా తెలిపింది. ఇదే విషయమై తాము డైరెక్టర్ జనరల్ అఫ్ యాంటీ ప్రాఫిటరింగ్తో సహకరిస్తున్నామని వెల్లడించింది. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా ఇదే విధంగా స్పందించింది.