Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ,వాణిజ్య విభాగం:
భారత మార్కెట్లో తిరుగులేని స్మార్ట్ ఉత్పత్తుల కంపెనీగా ఎదిగే లక్ష్యంతో తమ సంస్థ ముందుకు సాగుతోందని షావోమీ ఇండియా సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనూజ్ శర్మ తెలిపారు. సంస్థ మార్కెట్లోకి కొత్త ఆవిష్కరించిన రెడ్మీ వై3, రెడ్మీ 7 స్మార్ట్ఫోన్లను ఆయన గురువారం తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సంస్థ విక్రయిస్తున్న స్మార్ట్ఫోన్లలో దాదాపు 90 శాతం ఫోన్లను భారత్లోనే తయారు చేస్తున్నట్టుగా వివరించారు. స్మార్ట్ఫోన్లకు తోడుగా తమ సంస్థ ఎల్ఈడీ లైట్లు, సెక్యూరిటీ కెమేరాలు, ఎయిర్ ప్యూరిఫైర్లు, టీవీలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని రానున్న రోజుల్లో దేశంలో అత్యధికంగా ఉన్న మాస్ను చేరవయ్యేలే ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నట్టుగా ఆయన వివరించారు. రానున్న రోజుల్లో భారత మార్కెట్లో స్థిరమైన స్థానం సంపాదించుకొనేందుకు గాను తాము సంస్థ ఆఫ్లైన్ అందుబాటు విస్తృతిని వేగంగా పెంచనున్నట్టుగా ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై కూడా దృష్టి సారించనున్నట్టుగా తెలిపారు. ఆయా నగరాల్లో త్వరలోనే మై హోమ్ స్టోర్లను ఏర్పాటు చేయను న్నటుగా ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి 55 శాతం వృద్ధితో దాదాపు 10,000 పాయింట్ ఆఫ్ సేల్స్ ద్వారా విక్రయాలు జరిగేలా తమ విస్తృతి ప్రణాళికలను ముందుకు తీసుకుపోతున్నట్టుగా ఆయన తెలిపారు.